
బాధితులకు అండగా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
Updated on: 2024-09-03 04:06:00

ముంపు ప్రాంతాల్లోని బాధితులకు రాష్ట్ర రోడ్డు,భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అండగా నిలిచారు. విజయవాడలోని పాయకాపురం, కండ్రిగ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లోని 61, 62, 63, 64 డివిజన్లలోని వరద బాధితులకు మంత్రి జనార్ధన్ రెడ్డే స్వయంగా ట్రాక్టర్లో భోజనాలు, మంచినీరు, పాలు, మందు బిళ్లలు తీసుకెళ్లి అందజేశారు. భయాందోళనలో ఉన్న బాధితులకు ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాలకు వచ్చి సురక్షితంగా ఉండాలని ప్రజలను కోరారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక సిబ్బంది, ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ బాధితులను పునరావాస కేంద్రాలకు పంపించారు.